హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ మరింత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంస్థ దృష్టి సారించింది. ఈ మేరకు ఈ నెల 20, 21 తేదీల్లో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఈడీ(వో) రవీందర్, సంస్థ కార్యదర్శి మునిశేఖర్, ఈడీ (ఈ, పీ అండ్ ఏఎం) వినోద్, ఈడీ (కరీంనగర్) వెంకటేశ్వర్లు, ఈడీ (జీహెచ్జడ్) యాదగిరితో కూడిన అధికారుల బృందం వేర్వేరుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ర్టాల్లో అధ్యయనం చేసి వచ్చింది.
అకడి రవాణా సంస్థల ఆర్థిక స్థితిగతులు, రవాణా సామర్థ్యం, బస్సుల కొనుగోలు, బస్స్టేషన్ల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పన, వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, రాయితీలు, మారెటింగ్ సీమ్స్, ఖర్చుల నియంత్రణ, టికెట్ యేతర ఆదాయ మార్గాలు, అద్దె బస్సుల నిర్వహణ ఇలా వివిధ అంశాలపై అధికారులు అధ్యయనం చేశారు. బస్భవన్లో శుక్రవారం ఎండీ, వైస్ చైర్మన్లతో సమావేశమైన ఈ బృందం ఆయా రాష్ర్టాలకు సంబంధించిన విషయాలను నివేదించారు.
వాటిలో టీఎస్ఆర్టీసీ అమలు చేయగలిగే విధానాలు, మరింత మెరుగైన రవాణా సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. దీనిపై చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. వెంటనే ప్రాధాన్యం కలిగిన అంశాలను అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఈ మేరకు అమలు చేయాల్సిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.