కాళేశ్వరం, డిసెంబర్7: కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టులోని గ్రావిటీ కెనాల్లో ప్రమాదవశాత్తు గురువారం దుప్పి(Moose) పడింది. జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నేపల్లి పంప్హౌస్ నుంచి అన్నారం బరాజ్కు నీరు తీసుకువెళ్లే గ్రావిటీ కెనాల్(Gravity Canal)లో దుప్పి పడడంతో ప్రయాణికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రేంజర్ కమల సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి దుప్పిని పట్టుకున్నారు. అనంతరం డాక్టర్ మల్లేశ్తో వైద్య పరీక్షలు చేపి అడవిలో వదిలి పెట్టారు. ఈ కార్యక్రమంలో బీట్ అఫీసర్ ప్రశాంత్ రెడ్డి, గౌస్ తదితరులు ఉన్నారు.