బాసర, అక్టోబర్ 12: నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో సరస్వతీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారికి మూలా నక్షత్ర పూజలు నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. చిన్నారులకు అక్షర శ్రీకారాలు చేయించారు. ఆలయంతోపాటు పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.