కరీమాబాద్ : ‘కోతులు పోవాలె.. వానలు వాపస్ రావాలె’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా వానరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టు చిట్టడవిలా మారి కనువిందు చేస్తున్నది.
వరంగల్ అండర్ రైల్వేగేట్ 40వ డివిజన్ రంగశాయిపేటలో నాటిన వివిధ రకాల మొక్కలు చెట్లుగా ఎదుగుతున్నాయి. ఇందులో అరటి, పనస, సంత్రా, జామ, దానిమ్మ పండ్లు చేతికొస్తున్నాయి. సిబ్బంది నిరంతర పర్యవేక్షణతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.