హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ ర్ (టీజీటీ) పోస్టుల దరఖాస్తులను సోమవారం నుంచి 30 వరకు సవరించుకోవచ్చని ట్రిబ్ అధికారులు తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం టీజీటీ పోస్టుల భర్తీకి గత మే 27 వరకు దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే.