AIIMS Bibinagar | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగా ణ): బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కేం ద్రం అవలంబిస్తున్న తీరు ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’లా తయారైందని నెటిజన్లు చురకలు అంటించారు. ‘బీబీనగర్ ఎయిమ్స్కు 2018 డిసెంబర్లోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
9 నెలల్లో పనులు ఆరేడు శాతానికి మించి జరుగలేదు. పనులు పిల్లర్ల దశలో ఉండగా, మోదీ మాత్రం ఇప్పుడు భూమి పూజ చేసేందుకు రావడమేంటి?’ అని ప్రశ్నించారు. ‘పనులు పిల్లర్లకే పరిమితమైన య్.. మోదీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేందు కు వస్తున్నడు. ఇక పనులు ఎన్నేండ్లకు పూర్తవుతాయో?’ అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.