ములుగు, నవంబర్ 1 (నమస్తేతెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని గిరిజనుల హకులను హరిస్తున్నదని మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఆరోపించారు. మంగళవారం ఆయన ములుగులో మీడియాతో మాట్లాడారు. ములుగులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు బుధవారం గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన స్థలం వద్ద నిరసన దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ దీక్షకు మేధావులు, సామాజిక వేత్తలు, వామపక్షాలు, గిరిజన, గిరిజనేతర కుల సంఘాలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. 2017లో ఏపీలోని విజయనగరంలో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభమైందని, తెలంగాణలో ఏర్పాటు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
కిషన్రెడ్డి రాజీనామాకు సిద్ధమా?
ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపులు జరగలేదనడం విడ్డూరంగా ఉన్నదని సీతారాంనాయక్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తప్పని తాము నిరూపిస్తే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసేం దుకు సిద్ధమా? అని కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. ములుగులోని గట్టమ్మ దేవాలయం సమీపంలో 317 ఎకరాల భూమిని గిరిజన యూనివర్సిటీకి కేటాయించినా, కేంద్రం పనులు ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నదని మండిపడ్డారు.