హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): విద్యారంగానికి రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తున్నదని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అబిడ్స్లోని రెడ్డి హాస్టల్లో మంగళవారం నిర్వహించిన ట్రస్మా స్టేట్ కౌన్సిల్ సమావేశం, ఎడ్యుకేషన్ సెమినార్లో ఆయన మాట్లాడారు. తాను కూడా విద్యారంగం నుంచి వచ్చిన వాడినేనని, విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని తెలిపారు. ట్రస్మా అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మణిపూర్ యూనివర్సిటీ చాన్స్లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై జ్వోతి ప్రజ్వలన చేశారు. సమావేశంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, చింతల రాంచందర్, ఏ రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.