జనగామ: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను ఆయన కలుసుకుంటున్నారు. మంగళవారం జనగామ బతుకమ్మ కుంటలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇవాళ నియోజకవర్గ కేంద్రంలోని సిద్దిపేట వైపు ఉన్న ఉషోదయ ఫంక్షన్ హల్ లో చేర్యాల, కొమురవెల్లి మండల పార్టీ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలతో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఆయన తెలిపారు. కార్యకర్తలే పార్టీ బలం అన్నారు. ఏ పార్టీకి లేనంత కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ సైనికులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయ్యేలా ఎంతో కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు.