హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్తో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రి సత్యవతి నివాసంలో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ..గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.