హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఉపాధి హామీ పథకం సంఘం ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించారని, గత ఐదేండ్ల బడ్జెట్ల కంటే ఇదే అతి తకువని విమర్శించారు.
ఉపాధి హామీకి 2020-21 బడ్జెట్లో రూ.1,10, 000 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఏటేటా తగ్గిస్తూ పథకానికి తూట్లు పొడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం అమలుకు కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉపాధి కార్యక్రమాలను అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ప్రజలకు వీలైనంత ఎకువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కేంద్రం రాష్ర్టాలకు సహకరించడం లేదన్నారు. సమావేశంలో ఉపాధి హామీ పథ కం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ప్రవీణ్, లింగయ్య, వెంకట్రామ్రెడ్డి, విజయ్కుమార్, రఘు, సర్దార్సింగ్, అంజిరెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.