భీంపూర్, ఏప్రిల్ 25: పసివాడి వైద్యానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసానిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మం డల పరిషత్లో ఆపరేటర్గా పనిచేస్తున్న తాంసివాసి ఇప్ప సంతోష్ కొడుకు శ్రీయాష్ (9 నెలలు) కొవిడ్ పాజిటివ్తో హైదరాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. వెంటిలేటర్పై ఉన్న చిన్నారి వైద్యానికి సహకరించాలని ఆదిలాబాద్ స్వాస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ప్రణయ్ ఎమ్మెల్సీ కవితకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. స్పందించిన కవిత.. బాలుడికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ పరంగా చేయూతనిస్తామని హామీఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూ రు చేయిస్తామని బాలుడి తండ్రి సంతోష్కు ఫోన్ చేసి చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు, స్వాస్ అధ్యక్షుడు ప్రణయ్ ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.