హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘రాజగోపాల్ అన్న.. తొందరపడకు, మాట జారకు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త హెచ్చరించారు. ‘లిక్కర్ క్వీన్’ పేరు ఈడీ చార్జ్షీట్లో 28 సార్లు ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్వీట్ చేస్తే దానికి ఆమె ట్వి ట్టర్ వేదికగా స్పందించారు. ‘రాజగోపాల్ అ న్న.. తొందరపడకు, మాట జారకు, 28 సా ర్లు నా పేరు చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు.. ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
బీజేపీకి బీఆర్ఎస్ భయం
బీఆర్ఎస్ అంటే బీజేపీకి భయం పట్టుకున్నదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తనపై వచ్చిన బోగస్ ఆరోపణలకు కాలమే సమాధానం చెప్తుందన్నారు. కాంగ్రెస్ నేత మాణి క్యం ఠాగూర్ చేసిన ట్వీట్కు ఆమె రిైప్లె ఇచ్చారు. ‘నాపై నిందలు పూర్తిగా బోగస్, అవాస్తవం. నా నిబద్ధతను కాలమే రుజువు చేస్తుంది. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారుల అ నుకూల విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండగడుతుండటంతో బీజేపీకి భయం పట్టుకున్నది’ అని ఆమె రీట్వీట్ చేశారు.
లక్నో సదస్సు రండి..
భారత్ ముక్తి మోర్చా, వెనుకబడిన, మై నార్టీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ (బీఏఎంసీఈఎఫ్) 39వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవితను మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్కారత్ ఆహ్వానించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు యూపీలోని లక్నోలో నిర్వహించే సదస్సుకు రావాలని బుధవారం హైదరాబాద్లోని నివాసంలో కవితకు ఆహ్వానపత్రం అందజేశారు. మోర్చా జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రమ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సదస్సు అంశాలను ఆమెకు వివరిం చారు. ఈవీఎంలు తొలగించి బ్యాలెట్తో ఎన్నికల నిర్వహణ, బీసీ కుల గణన, జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచడం వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.