హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను నిర్ధారిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనమండలికి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల ఎన్నికపై బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ గెజిట్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనన్న సంగతి తెలిసిందే.
ఉమ్మడి ఆదిలాబాద్లో దండే విఠల్, వరంగల్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండలోమంకేన కోటిరెడ్డి, మెదక్లో వంటేరి యాదవరెడ్డి, నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత, ఖమ్మంలో నుంచి తాతా మధుసూదన్, కరీంనగర్లో ఎల్.రమణ, తానిపర్తి భానుప్రసాద్ రావు, మహబూబ్నగర్లో కె. దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రంగారెడ్డిలో పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో వీరి ఎన్నికను ఖరారు చేశారు. వీరందరూ ఆరు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు.