ఆదిలాబాద్ : తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, రైతుల ఆందోళనలకు మద్దతుగా ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వడ్లు కొనుగోలు చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.