దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పాస్టర్ కుటుంబాన్ని ప్రభాకర్ రెడ్డి పరామర్శించి వస్తుండగా దాడి జరిగింది. కడుపులో తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసరం అయితే హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.