వరంగల్ : నాకు ఆస్తిపాస్తులు లేవు..ప్రజలే నా ఆస్తి అని నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (MLA Pedhi Sudarshan Reddy) అన్నారు. సోమవారం నర్సంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్(CM KCR)తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ..గతంలో నర్సంపేట ఎట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉండోదే ఆలోచన చేయాలన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, గోదావరి జలాలు. తీసుకొచ్చాం.
ఫుడ్ పార్క్కు అనుమతి, నర్సంపేట పట్టణ పరిధిలో రాష్ట్రంలో మొట్టమెదటి సీఎన్జీ గ్యాస్ కేటాయింపు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. రైతులను అనేక విధాలుగా ఆదుకున్నామన్నారు. కరోనా కాలంలో ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి వేయి మంది ప్రాణాలు కాపాడాను. ప్రతి పక్షాలు ఆనాడు పారి పోతే మీ మధ్యన బతికన.. చేసిన అభివృద్ధి కండ్ల ముందు ఉంది. నాకు ఆస్తుపాస్తులు,లేవు మీరే నా ఆస్తి. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.