హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో(Congress) చేరిన(,Switched parties) ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kausish Reddy) ఫైర్ అయ్యారు. గురువారం బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో గెలిచి నేడు పార్టీ మారడం సిగ్గు చేటన్నారు.
నిజంగా రోషం ఉంటే కడుపుకు అన్నం తింటుంటే, మీరు నిజంగా మొగోల్లు అయితే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలువాలని సవాల్ విసిరారు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఆ ముగ్గురి నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయని, వారి డిపాజిట్ గల్లంతవడం ఖాయమని పేర్కొన్నారు.
పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలు చేసి.. సావు డప్పు కొడతామని హెచ్చరించారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే పార్టీలు మారారని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.