అశ్వరావుపేట : సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అశ్వరావుపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు(MLA Mecha Nageswara Rao) అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఎనిమిది వందల కోట్లతో అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అశ్వారుపేటలో రూ.35 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, డిగ్రీ కాలేజీ, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారన్నారు.
అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్యను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో ఎవరు చేయని విధంగా ఇప్పటికే పదివేల మందికి పోడు పట్టాలు అందజేశారు. కొన్ని చోట్ల సాదాబైనమాలు పెండింగ్లో ఉన్నాయని అవి కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వినాయకపురంలో రెవెన్యూ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.