హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ హయాంలో(Congress regime)నే లక్డారం క్వారీ అనుమతులు(Quarry permits) తీసుకున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. క్వారీని నా సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నదని ఆరోపించారు. 2011-12లో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే క్వారీ లీజుకు తీసుకున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
క్వారీకి సంబంధించిన అన్ని అనుమతులు తమకు ఉన్నాయని చెప్పారు. మేం తప్పు చేసినట్లు తేలితే జరిమానా విధించాలన్నారు. బెదిరింపులకు బయపడేదిలేదని, ప్రజా కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏదైనా తప్పు చేస్తే నోటీసులు, పెనాల్టీ వేయాలి. అంతేకాని తెల్లవారుజామున 3 గంటలకు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమన్నారు.