కుమ్రం భీం ఆసిఫాబాద్ : చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణంతో నా చిరకాల స్వప్నం నెరవేరిందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. చింతలమానేపల్లి మండల పర్యటనలో భాగంగా గూడెం వద్ద వంతెనను పరిశీలించారు. వంతెన నిర్మాణంతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రతో వ్యాపార సంబంధాలతో పాటు రైతులకు కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిన వెంటనే నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, జెడ్పీటీసీ శ్రీదేవి, నాయకులు వెంకన్న స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.