నీలగిరి, డిసెంబర్ 17: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నల్లగొండ మండలం నర్సింగ్భట్లకు చెందిన గాదరి మారయ్య పీఈటీగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సేవలందించారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో కుటుంబంతో కలిసి శేషజీవితం గడుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మారయ్య మరణించారు. ఆయన అంత్యక్రియలు శనివారం నల్లగొండలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మారయ్య మృతిపట్ల మంత్రి జగదీశ్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.