నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు లో బీఆర్ఎస్ ( BRS ) లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Mla Chirumurthy Lingaiah) అన్నారు . నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన సుమారు వందమంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్(BRS) లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .
ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం,అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే మార్గదర్శనీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్( CM KCR) పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో..
పార్టీలో చేరిన వారిలో బొగురాల యాదయ్య, బోగూరాల జనార్దన్, పాండుగుల జనార్దన్, బండమీది వెంకన్న, పొల్లగొని సైదులు, కోరిమి సైదులు, గంగాదేవి పాపయ్య, కొత్వాల నాగరాజు, ఆదిరాల చిన్న పుల్ల రావు, ఆదిరాల లింగయ్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధ ధనలక్ష్మి నగేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సొమ యాదగిరి, పెండం సదానందం, పట్టణ అధ్యక్షుడు యల్లపు రెడ్డి సైది రెడ్డి, గ్రామా శాఖ అధ్యక్షుడు చేనగాని జానయ్య, బంటు రవి ఎరుకల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు .