నల్లగొండ : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారుకార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిల్లి రామరాజు, బోనగిరి దేవేందర్, నాయకులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.