రామచంద్రాపురం, సెప్టెంబర్ 10: గవర్నర్ వ్యవస్థ రాజకీయాలకు అతీతమని, గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తులు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీలో శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొండ ప్రాంతాల్లో ఉన్న మి జోరం రాష్ట్రం ఇప్పుడిప్పుడే దేశంలోని ఇతర రాష్ర్టాలతో అనుసంధానం అవుతున్నదని తెలిపారు. మిజోరం గవర్నర్గా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, తెలంగాణ గవర్నర్ వ్యవహారంపై తాను మాట్లాడనని హరిబాబు పేర్కొన్నారు.