మిర్యాలగూడ : రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారో అని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాలకు చాలా మంది కన్సల్టెన్సీ ద్వారా వెళ్తుంటారు.
ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన యువకుడు అజయ్ (మిర్యాలగూడలో అమృత – ప్రణయ్ ప్రేమ వ్యవహారంలో హత్యకు గురైన ప్రణయ్ సొంత తమ్ముడు అజయ్) వైద్య విద్య అభ్యసించడానికి రష్యా వెళ్ళాడు. మరో మూడు నెలల్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పూర్తిచేసుకుని తిరిగి స్వస్థలం మిర్యాలగూడకు రావాల్సి ఉంది.
యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడే చిక్కుకున్నాడు. యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఈరోజు రష్యా నుంచి తిరిగి ఇండియా రావడానికి సిద్ధం కాగా..ఆకస్మికంగా రష్యా ప్రభుత్వం విమానాలను నిలిపివేయడంతో అజయ్ అక్కడే చిక్కుకుపోయాడు.
దీంతో మిర్యాలగూడలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని వేలాదిగా ఉన్న విద్యార్థులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా, ఉక్రెయిన్ దేశంలో కామారెడ్డి జిల్లా బోధన్కు చెందిన మరో విద్యార్థి వినయ్ చిక్కుకుపోయాడు. వినయ్ ఎంబీబీఎస్ మూడో సవత్సరం చదువుతున్నాడు.