మద్నూర్, మార్చి 21: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హింగోలి వద్ద భూకంప కేంద్రం నమోదు కాగా, దీని ప్రభావం కామారెడ్డి జిల్లా మద్నూర్ వరకు కనిపించింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత కన్పించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. తెల్లవారుజామున ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.