హైదరాబాద్ : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థీవదేహానికి మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. రోశయ్య శనివారం మృతి చెందగా.. హైదరాబాద్ ధరమ్ కరణ్ రోడ్డులోని ఆయన నివాసానికి చేరుకొని పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక పదవులను అలంకరించి, వాటికి వన్నె తీసుకువచ్చారన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వడంతో పాటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.