మహబూబాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కలెక్టరేట్ కార్యాలయ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులు బాగున్నాయంటూ అధికారులను అభినందించారు.
రహదారుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ 12న ఉదయం 10 గంటలకు మహబూబ్నగర్కు వస్తారని తెలిపారు. మొదట టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, ఆ తర్వాత సమీకృత కలెక్టరేట్ను ప్రారంభిస్తారన్నారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తారన్నారు. అధికారులు సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
అనంతరం కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని సందర్శించారు. మీటింగ్ హాల్, వీఐపీ సమావేశ మందిరాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల వెంట కలెక్టర్ శశాంక, జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోత్ బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ డేవిడ్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.