Balagam Mogilaiah | బలగం సినిమాలో క్లైమాక్స్ సాంగ్ తోడుగా మాతో ఉండి అనే పాటను ఆలపించి అందరినీ ఏడిపించిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మొగిలయ్య ఆరోగ్యంపై రాష్ట్ర మంత్రులు హరీశ్రావు( Harish Rao ), ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayaker Rao ) స్పందించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. మొగిలయ్యను వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు.
గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మొగిలయ్య.. వరంగల్లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో తన భర్త ప్రాణాలను కాపాడాలని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కొమురమ్మ వేడుకున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.