మెండోరా/మోర్తాడ్, సెప్టెంబర్ 12: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో తామంతా మంత్రి వెంటే ఉంటామంటూ పలు గ్రామాలు, కుల సంఘాల వారు పెద్ద ఎత్తున తీర్మానాలు చేస్తున్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం ఎల్కటూర్ గ్రామంలోని ఎస్సీ మాదిగ సంఘం సభ్యులు 26 మంది, యాదవ సంఘం సభ్యులు 35 మంది, కుమ్మరి సంఘం సభ్యులు 30 మంది,
దూద్గాం గ్రామంలోని రజక సంఘం సభ్యులు 54 మంది, యాదవ సంఘం సభ్యులు 60 మంది మంత్రి ప్రశాంత్రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తీర్మానం చేశారు. తీర్మాన ప్రతులను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు. మోర్తాడ్ మండలంలో దోన్పాల్కు చెందిన వడ్డెర సంఘం సభ్యులు 80, శెట్పల్లి గ్రామం లో గంగపుత్ర సంఘం సభ్యులు మంత్రికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.