హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కొత్త సచివాలయంలో ఏసీ ప్లాంట్లను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సచివాలయంలో 540 టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు ఎయిర్ కండీషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
ఇందులో మూడు ప్లాంట్లు నిరంతరం నడవనుండగా, మరొకటి స్టాండ్బైగా ఉంటుంది. అనంతరం సచివాలయ ఫినిషింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయం ప్రారంభించే గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలని, గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.