హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న అమితమైన ప్రేమకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజనబంధు, పోడుభూముల శాశ్వత పరిష్కారం వంటి నిర్ణయాలు తీసుకోవటమే నిదర్శమన్నారు. హైదరాబాద్ నడిగడ్డన గిరిజనులకు భవనాలు నిర్మించడం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు. గిరిజనులకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.