హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ సేల్ ఫ్రేమ్వర్(ఎఫ్ఎఫ్ఎస్) పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సదరన్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
అనుమతి లేకుండా హెచ్ఆర్ఏ పెంచొద్దు: ఆర్థిక శాఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ అనుమతి లేకుండా.. ఉత్తర్వుల్లేకుండా ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) పెంచొద్దని ఆర్థికశాఖ ఆదేశించింది. దీంతో నూతనంగా ఏర్పడ్డ జీహెచ్ఎంసీతోపాటు 8 కి.మీ. పరిధిలోని వారికి 24% హెచ్ఆర్ఏ వర్తింపునకు బ్రేక్లు పడ్డాయి.
జలమండలిలో 130 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జలమండలిలో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు మల్టీజోన్-2 వారు మాత్రమే పోటీపడొచ్చు.
ఎఫ్ఎల్ఎన్ సంసరణల్లో తెలంగాణకు గుర్తింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) బలోపేతానికి చేపట్టిన సంసరణలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారోత్సవంలో భాగంగా నిర్వహించే మినిస్టీరియల్ రౌండ్టేబుల్ సమావేశంలో ప్రసంగించేందుకు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాకు ఆహ్వానం అందింది.