హైదరాబాద్: కొత్తతరం గీత రచయితలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆదర్శమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) అన్నారు. సిరివెన్నెల మరణించడం తెలుగు చత్రసీమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరని లోటన్నారు. ఫిల్మ్ చాంబర్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారామశాస్త్రి పాటలు తెలుగు తనం ఉట్టిపడేలా ఉగాది పచ్చడిలా, సంక్రాతి, దీపావాళి పండుగలా ఉంటాయన్నారు. వారికి పద్మశ్రీ, 11 సార్లు నంది అవార్డులు గొప్పవిషయమని చెప్పారు. ఆయన పాటల్లో చక్కని తెలుగు, కమ్మదం ఉంటుందని, అర్థం, పరమార్థం ఉంటాయని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా ఉంటాయని చెప్పారు. చాలా తక్కువ వయస్సులో మరణించడం బాధాకరమన్నారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.