హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు (Ujjaini Mahankali Bonalu) ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర పండుగ అయిన బోనాలకు (Bonalu) అన్ని శాఖలు సహకరించాయని తెలిపారు. మహంకాళి బోనాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ కార్యక్రమంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సం జరుగుతాయన్నారు. లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, రాత్రి అంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు దర్శనం అమ్మవారిని దర్శనం చేసుకున్నారని వెల్లడించారు.
ఒకప్పుడు రాజకీయ నేతలు దర్శనం తరువాత వర్షాలు పడాలి అని కోరుకునే వారని చెప్పారు. 2014 తరువాత రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. బోనాలకు సహకరించిన అన్ని విభాగాలకు ధన్యవాదాలు తెలిపారు. రాత్రి 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని చెప్పారు.