హైదరాబాద్ : పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani)అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బన్సీలాల్ పేట, సనత్నగర్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. యాభై సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమీ చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తదని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లీడర్లతో అయ్యేది లేదు..పోయేది లేదన్నారు. ప్రజలకు ఏమి చేయాలన్నా అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.