హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. అమీర్పేట(Ameerpet)లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి వచ్చే పొలిటికల్ టూరిస్ట్ లతో కలిగే ప్రయోజనం శూన్యమని స్పష్టం చేశారు. సమర్ధవంతమైన పాలనను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపర్చాలని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ఓట్లను అడుగుతున్నది. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.