హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani)తెలిపారు. సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్(BRS) పార్టీ ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
దళిత బంధు(Dalitabandu) క్రింద ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. గుండె, కిడ్నీ తదితర ఆపరేషన్లను ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందని వెల్లడించారు.
మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం దుర్మార్గమని బీజేపీ పార్టీపై మండి పడ్డారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.ప్రజల కోసం పనిచేసే వారిని ఆదరిస్తే లాభం జరుగుతుందని, నిరంతరం ప్రజల మధ్య ఉండే వారిని ఒడిస్తే నష్టపోయేది ప్రజలేనని జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ తెలిపారు.