మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గెస్ట్ హౌస్లో ఓ నాలుగు భారీ వృక్షాలు ఉన్నాయి. వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆ వృక్షాలను సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించి మళ్లీ జీవం పోయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిశ్చయించుకున్నారు.
ఈ క్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో ఆ నాలుగు వృక్షాలను ట్రాన్స్ లోకేషన్ చేపట్టారు. ఆ వృక్షాలను జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించి అక్కడ నాటినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గెలిపారు. ట్రాన్స్ లోకేషన్ చేసిన చెట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Successfully translocated 4 giant trees which are estimated to be 100 years old from R&B Guest House to KCR Eco Urban Park in Mahabubnagar. Special thanks to Hon’ble MP Santosh Kumar Garu for providing the necessary assistance in saving the trees. pic.twitter.com/8kidgkvelz
— V Srinivas Goud (@VSrinivasGoud) April 17, 2022