Srinivas Goud | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఉదయం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీలోని ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పాలకొండకు చెందిన తిరుపతమ్మ ఇంటికి వెళ్లగా ఆమె కట్టెల పొయ్యిపై వేడివేడిగా జొన్న రొట్టెలు చేస్తూ కనిపించింది. అయ్యో తిరుపతమ్మ గ్యాస్ ధర ఎక్కువైందని కట్టెల పొయ్యి మీద చేస్తున్నావా.. మోదీ పెంచిన గ్యాస్ ధరను మేం భరించి మీకు భారం తగ్గించనున్నాం. జనవరి నుంచి రూ. 400లకే సిలిండర్ ఇచ్చి మీకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పిస్తామని మంత్రి అన్నారు. మంత్రి కొద్ది సేపు రొట్టెలను పెనంపై కాల్చి సాయం చేశారు. ఉదయమే ఇంటికి వచ్చిన మంత్రికి తిరుపతమ్మ వేడివేడి రొట్టెలు అందించగా.. మంత్రి వాటిని తింటూ ఆమెతో మాట్లాడారు.
తాము తెలంగాణ ప్రభుత్వం ద్వారా అనేక పథకాలను లబ్ధి పొందామని తిరుపతమ్మ మంత్రికి తెలిపింది. కచ్చితంగా తాము కారు గుర్తుకే ఓటేస్తామని పేర్కొంది. ఒక్క తమ ఇంటికే రైతుబంధు, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వస్తున్నదని తెలిపింది. 24 గంటల ఉచిత కరెంటు వల్ల సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నామని వివరించింది. 2014కు ముందు ట్యాంకర్తో నీళ్ళు వచ్చేవని, తాగునీళ్ల కోసం గొడవపడే పరిస్థితి ఉండేదని, బలమున్నోళ్లకే నీళ్లు దొరికేవని వాపోయింది. ఇప్పుడు ఆనాటి కష్టాలన్నీ సమిసిపోయాయని, ఇంటికే నేరుగా నల్లా ద్వారా మంచినీళ్లు వస్తున్నాయని ఎంతో సంతోషంగా జీవిస్తున్నామని పేర్కొంది. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తాము అండగా ఉంటామని తెలిపింది. భవిష్యత్తులోనూ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొని అక్కడి నుంచి ప్రచారానికి బయలుదేరారు.
మహబూబ్ నగర్ నియోజకవర్గం పాలకొండ గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించడం జరిగింది. పిట్టల శ్రీనివాసులు, తిరుపతమ్మ ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకోవడం జరిగింది, తిరుపతమ్మ కుటుంబానికి రైతుబంధు, కళ్యాణ లక్ష్మి మరియు వారి… pic.twitter.com/FwvKhSpWFi
— V Srinivas Goud (@VSrinivasGoud) October 26, 2023