హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి సీతక తెలిపారు. ఈ దిశగా చరిత్రకారులు, సామాజికవేత్తలు, అనుభవజ్ఞులు, ఆంథ్రోపాలజిస్టులు కలిసి పనిచేయాలని కోరారు. శుక్రవారం జ్యోతిబా పూలే ప్రజాభవన్లో మేడారం సమ్మక్కసారలమ్మ జాతర కాఫీ టేబుల్ బుక్ను ఆమె ఆవిషరించారు. ఈ సందర్భంగా కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్టును అభినందించారు.
మేడారం సమ్మక సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం కాకతీయ హెరిటేజ్ సభ్యులు, ఫొటోగ్రాఫర్లను ఆమె శాలువాలతో సతరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు కాఫీటేబుల్ బుక్ ఎడిటర్ బీ నర్సింగరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బీవీ పాపారావు, బీపీ ఆచార్య, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం రతన్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీ ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, జే శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు.