జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో మహారాష్ట్రలోని సిరోంచకు చెందిన కుమ్మరి చాందిని శనివారం ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే.. జిల్లా దవాఖాన సందర్శనకు వెళ్లిన గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చాందినితో మాట్లాడారు.
మహారాష్ట్ర నుంచి ఇంత దూరం వచ్చారా? అక్కడ దవాఖానలు లేవా? అని అడుగగా.. అక్కడ సర్కారు దవాఖానలు సరిగా లేవని, ఉన్న దవాఖానల్లో వైద్యం సక్రమంగా అందదని చాందిని చెప్పింది. ఈ సందర్భంగా చాందిని తమ పాపకు పేరు పెట్టాలని మంత్రిని కోరగా.. మంత్రి సత్యవతి ఆ పాపకు ‘మహాలక్ష్మి’ అని నామకరణం చేశారు.
-జయశంకర్ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ