ములుగు : జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సఖి కేంద్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు.
ట్రైకార్ ద్వారా మంజూరైన సరుకు రవాణా వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. రూ.1.50 కోట్లతో నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం జాతీయ రహదారి వద్ద నుంచి లక్నవరం కాటేజీ వరకు నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
అనంతరం తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పర్యటించనున్నారు. మేడారం మహా జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి వెంట మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తదితరులు ఉన్నారు.