మహబూబాబాద్ : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని నినదించారు.
మంత్రితో పాటు జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, కొమురయ్య, ఎస్పీ శరత్ చంద్ర పవర్, అదనపు ఎస్పీ సదయ్య, స్థానిక నేతలు, జిల్లా అధికారులు ఉన్నారు.