Minister Satyavathi | ముదిరాజ్ల గురించి ఆలోచించిందే ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో జడ్పీటీసీ జోరుక సదయ్య ముదిరాజ్ అధ్యక్షతన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి మంత్రి సత్యవతి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బసవరాజు సారయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేపల ఎగుమతిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు. ముదిరాజుల గురించి ఆలోచించింది సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు. బండ ప్రకాశ్కు సీఎం సముచిత స్థానం కల్పించారన్నారు. బండ ప్రకాశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనను పిలిచిమరి రాజ్యసభకు పంపారన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు తనకు ఓటు వేసి రాజ్యసభకు పంపగా.. 34మందిలో తనకు ఓటు వేసిన 34వ వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు.