ములుగు : తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను, నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.మహాధర్నాలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జెడ్పీ చైర్మన్ జగదీశ్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, స్థానిక నాయకులు గోవింద్ నాయక్, ఇతర నేతలు, రైతులు పాల్గొని రైతుకు సంఘీభావం తెలిపారు.