హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఉన్నత విద్య సెమిస్టర్ పరీక్షల స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఉన్నత విద్యాశాఖ అమలు చేయనున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)సూచించిన ఏడు సిఫారసుల మేరకు దీనిని ఈ విద్యాసంవత్సరం నుంచి పైలట్ పద్ధతిలో అమలు చేయనున్నారు. ప్రస్తుత మూల్యాంకన పద్ధతులను సమగ్రంగా అధ్యయనం చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ‘అసెస్సింగ్ అసెస్మెంట్ ఇన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఏ స్టడీ ఆఫ్ ది అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ’ పేరిట అధ్యయన నివేదికను రూపొందించింది. సోమవారం ఈ నివేదికను హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఐఎస్బీ సిఫారసులను ఇప్పటికే ఓయూలో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మిగతా వర్సిటీల్లో కూడా పూర్తిస్థాయిలోకి ఆచరణలోకి తీసుకొస్తామని, ఇందుకు ఒక కమిటీని కూడా నియమిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
సమగ్ర మూల్యాంకన పద్ధతులివే..
విద్యార్థులను ప్రాక్టికల్ ఫీల్డ్ స్టడీకి తీసుకెళ్తారు. ఫీల్డ్స్టడీలో ఏం నేర్చుకున్నారో అక్కడికక్కడే రాయమని టీచర్ చెబుతారు. క్లాస్ రూంలో విద్యార్థులను బృందాలుగా విడగొట్టి క్విజ్ పోటీ పెడతారు. విద్యార్థులకు ఒక సమస్యను ఇచ్చి పరిష్కరించమంటారు. క్లాస్ చెప్పిన వెంటనే అధ్యాపకుడు సడెన్గా ఎగ్జామ్ పెట్టి.. అప్పటికప్పుడే పేపర్లు దిద్దుతారు. ఇలా ప్రతి కృత్యాన్ని మూల్యాంకనం చేస్తారు. ఇలా పాఠశాల విద్యలో అవలంబిస్తున్న ‘నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని’ ఉన్నత విద్యలోని సెమిస్టర్ పరీక్షల స్థానంలో అమలు చేస్తారు.
అధ్యయన ఫలితాలు..
ఐఎస్బీ ఏడు సిఫారసులివే..