హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): లోక్సభలో మహిళా బిల్లు ఆమోదం పొందడం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం ప్రకటించారు. మహిళలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహిళా బిల్లు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం ఎంతో గొప్పదని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానంతోపాటు బిల్లు ఆమోదం కోసం వివిధ రకాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలతోపాటు, మారె ట్ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన, బిల్లు ఆమోదానికి కృషిచేసిన సీఎం కేసీఆర్కు మహిళల తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తూ చేసిన ఉద్యమం కూడా మహిళ లోకం మరిచిపోదని కొనియాడారు. ఇది యావత్ మహిళా లోకానికి దకిన గౌరవంగా అభివర్ణించారు. మహిళా బిల్లుపై వివిధ దశల్లో ఉద్యమం చేసిన కవితకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.