హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఏపీ పర్యాటక శాఖ మంత్రి, సీనియర్ నటి రోజా సెల్వమని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితం కాలు బెణకడంతో ఫిజియోథెరపీ చేయించుకున్నారు.
ఆమె చెన్నైలోని నివాసంలో కుటుంబసభ్యులతో ఉన్న సమయంలో శనివారం రాత్రి ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో అర్ధరాత్రి ఆపోలోకు తరలించారు. దీంతో 10 రోజులుగా నియోజకవర్గ కార్యక్రమాలకు మంత్రి రోజా దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, త్వరలో డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.